చిత్తూరు ప్రభుత్వ పాఠశాలలోకి అడవి ఏనుగులు

శుక్రవారం, 24 నవంబరు 2023 (15:01 IST)
చిత్తూరు సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలోకి ప్రవేశించిన అడవి ఏనుగులు అక్కడున్న సామాగ్రిని ధ్వంసం చేశాయి. అనంతరం విద్యాశాఖ, అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతంలో వ్యక్తిగత తనిఖీలు నిర్వహించారు. 
 
చిత్తూరు జిల్లా బంగారు పాళ్యం మండలం కీరమండ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోకి గురువారం రాత్రి అడవి ఏనుగులు ప్రవేశించి అక్కడున్న వస్తువులను ధ్వంసం చేశాయి. ఈ క్రమంలో గురువారం ఉదయం పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు యథావిధిగా పాఠశాలకు వెళ్లారు.
 
ఆ సమయంలో పాఠశాల రిజర్వు గదిలో మధ్యాహ్న భోజనం కోసం ఉంచిన నిత్యావసర వస్తువులు, కిరాణా సామాన్లు చెల్లాచెదురుగా పడి ఉండటాన్ని చూసి అవాక్కయ్యారు. 
 
అలాగే తరగతి గదిలో కిటికీలు, తలుపులు పగులగొట్టి ఉండడంతో ఒక్కసారిగా షాకైన వారు పాఠశాల వెనుకవైపు వెళ్లి చూడగా అక్కడ ఏనుగుల పాదాలు కనిపించాయి. ఈ ఘటనపై అటవీ శాఖా అధికారులకు సమాచారం అందించడం జరిగింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు