వివాహేతర సంబంధం.. వద్దమ్మా అన్నాడు.. అంతే కన్నకొడుకునే చంపేసింది..

బుధవారం, 22 ఆగస్టు 2018 (15:25 IST)
వివాహేతర సంబంధాలు.. వాటి ద్వారా జరిగే నేరాలు అధికమవుతున్నాయి. అక్రమ సంబంధాల కారణంగా హత్యలు పెరిగిపోతున్నాయి. తాజాగా వివాహేతర సంబంధానికి అడ్డు చెప్తున్నాడనే కారణంగా కన్నకొడుకునే కర్కశ తల్లి హత్య చేసింది. 
 
ఈ ఘటన విజయనగరం జిల్లా కేంద్రంలోని గాయత్రీనగర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లాకు చెందిన ఓ వివాహిత 17 ఏళ్ల క్రితం భర్తతో విడిపోయింది. భర్తతో విడిపోయిన తర్వాత ఆమె కొంత కాలంగా మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. 
 
ఈ వ్యవహారంపై ఆమె కుమారుడు హరిభగవాన్‌ గొడవకు దిగేవాడు. దీంతో తల్లీకుమారుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో హరి భగవాన్ తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఆ తల్లి భావించింది. భోజనంలో నిద్రమాత్రలను కలిపి హరిభగవాన్‌కు ఇచ్చింది. భోజనం తిన్న తర్వాత హరిభగవాన్ మత్తులోకి జారుకొన్నాడు. ఆపై చున్నీతో అతడి గొంతు బిగించి హత్య చేసింది. 
 
ఈ విషయమై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో కుమారుడిని హత్యచేసినట్లు ఒప్పేసుకుంది. అయితే హరిభగవాన్ హత్యలో ప్రియుడి ప్రమేయం కూడ ఉందా లేదా అనే కోణంలో విచారణ జరుగుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు