ఎయిర్‌ ఏషియా బంపర్ ఆఫర్.. రూ.99లకే ఫ్లైట్ జర్నీ

సోమవారం, 13 నవంబరు 2017 (09:38 IST)
మలేషియాకు చెందిన బడ్జెట్ విమానయాన సంస్థ ఎయిర్‌ ఏషియా (ఇండియా) బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది డొమెస్టిక్ వన్ వే టిక్కెట్ బేస్ రేటును రూ.99గా, విదేశాలకు రూ.444గా నిర్ణయించింది. ఈ పరిమితకాల ఆఫర్ టిక్కెట్ల బుకింగ్ ఆదివారం రాత్రి ప్రారంభమై ఈనెల 19వ తేదీతో ముగుస్తుంది. ఈ ఆఫర్‌లో బుక్ చేసుకున్న టిక్కెట్ల ద్వారా వచ్చే యేడాది మే నుంచి జనవరి 2019 మధ్యకాలంలో మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది. 
 
ఈ ఆఫర్ టిక్కెట్లను సంస్థ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారానే బుక్ చేసుకునే వెసులుబాటువుంది. అయితే, ఈ ఆఫర్ కింద బేస్ రేటుతోపాటు అదనపు చార్జీలు, పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, విమాన టిక్కెట్ ధరలో ఇంధన సర్‌చార్జీ, ఎయిర్‌పోర్టు ఫీజు, పన్నులు, ఇతర చార్జీలను ప్రయాణికుడు భరించాల్సిఉంటుంది. 
 
ఈ ఆఫర్‌లో బుక్ చేసుకున్న టిక్కెట్ల ద్వారా ఎయిర్‌ఏషియా జాయింట్ వెంచర్ సంస్థలకు చెందిన ఏ విమానాల ద్వారానైనా ప్రయాణించవచ్చని ఆ సంస్థ ప్రతినిధులు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. దేశీయ మార్గాల్లో హైదరాబాద్, బెంగళూరు, కొచి, రాంచీ, భువనేశ్వర్, కోల్‌కతా, ఢిల్లీ, గోవా ఇంకా పలు మార్గాల్లో ఈ ఆఫర్ వర్తించనుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు