తగ్గుతున్న వడ్డీ రేట్లు, పెట్టుబడిదారులకు ఆకర్షణీయంగా మారిన మనీ మార్కెట్ ఫండ్లు: టాటా ఏఎంసి

ఐవీఆర్

మంగళవారం, 24 జూన్ 2025 (20:31 IST)
హైదరాబాద్: వడ్డీ రేట్లు తగ్గుతున్న క్రమంలో, రాబడి, భద్రత, లిక్విడిటీ(ద్రవ్యత)ను సమతుల్యం చేసుకోవాలనుకునే పెట్టుబడిదారులకు మనీ మార్కెట్ ఫండ్లు ఆకర్షనీయమైన ఎంపికగా మారుతున్నాయి. స్వల్పకాలిక, అధిక-నాణ్యత గల హోల్డింగ్‌లకు పేరుగాంచిన ఈ నిధులు, తగ్గుతున్న వడ్డీ రేటు వాతావరణంలో ప్రయోజనం పొందేందుకు తోడ్పడనున్నాయి. 
 
"మనం ఫ్రంట్ లోడెడ్ పాలసీ సడలింపు దశలోకి అడుగుపెడుతున్నందున, మనీ మార్కెట్ ఫండ్‌లు పెట్టుబడిదారులకు ఒక స్మార్ట్ కేటాయింపు ఎంపికను అందిస్తున్నాయి. రెపో రేటు ఇప్పుడు 5.5% వద్ద ఉండటంతో, పెట్టుబడిదారులు మనీ మార్కెట్ ఫండ్‌లలో రెపో కంటే అదనంగా 50-75 బేసిస్ పాయింట్లను సంపాదించవచ్చు, అదే సమయంలో లిక్విడిటీని కొనసాగిస్తూ, అనిశ్చితిని పరిమితం చేసుకోవచ్చు" అని టాటా అసెట్ మేనేజ్‌మెంట్, ఫిక్సడ్ అసెట్ డిప్యూటీ హెడ్ అమిత్ సోమానీ అన్నారు.
 
మనీ మార్కెట్ ఫండ్‌లు ట్రెజరీ బిల్లులు, వాణిజ్య పత్రాలు, డిపాజిట్ సర్టిఫికెట్లు వంటి సాధనాలలో పెట్టుబడి పెడతాయి, ఇవి స్థిరత్వం, రాబడి మధ్య సమతుల్యతను అందిస్తాయి. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా(AMFI) వెల్లడించే దాని ప్రకారం, ఈ విభాగం ఏప్రిల్, మే 2025లో రూ. 42,730 కోట్ల సంచిత నగదు ప్రవాహాన్ని అందుకుంది. ఈ ధోరణిని ప్రతిబింబిస్తూ, టాటా మనీ మార్కెట్ ఫండ్ గత రెండు నెలల్లో హైదరాబాద్ నుండి రూ. 671.2 కోట్ల నగదు ప్రవాహాన్ని నమోదు చేసింది. ఇది ఆర్థిక సంవత్సరం 2024లో రూ. 1,631 కోట్ల నుండి ఆర్థిక సంవత్సరం 2025లో రూ. 2,662 కోట్లకు పెరిగింది, ఇది ఫండ్ నిర్వహణలో ఉన్న ఆస్తులలో రూ. 30,000 కోట్ల మైలురాయికి దోహదపడింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు