పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత సాయుధ దళాలు ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందని ప్రకటించారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ప్రశంసించారు. ఆపరేషన్ సింధూర్ విజయంపై రాహుల్ గాంధీ భారత సైన్యాన్ని అభినందించారు. ఇంకా ఎక్స్లో ఇలా పోస్టు చేశారు. "మా సాయుధ దళాలను చూసి గర్వపడుతున్నాను. జై హింద్!" అని అన్నారు.