సరదా కోసం బైకులను దొంగలించిన కోటీశ్వరుడు.. రోజుకో యాక్టివా..

సెల్వి

శనివారం, 6 జనవరి 2024 (19:40 IST)
సరదా కోసం బైకులను కొల్లగొట్టే ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో 168 యక్టీవాలను హితేష్ జైన్ అనే కోటీశ్వరుడు సరదా కోసం బైకులను దొంగలించాడు. అయితే చాలా కాలం పాటు పోలీసులకు దొరక్కుండా తిరిగిన అతడు ఇటీవలే పట్టుబడ్డాడు. నిజానికి హితేష్ జైన్‌కు డబ్బులకు లోటు లేదు. 
 
లగ్జరీ కార్ల జర్నీ కోసం దొంగతనాన్ని వృత్తిగా ఎంచుకున్నాడు. తన కోరికను తీర్చుకునేందుకు హితేష్ జైన్ యాక్టివాలను దొంగిలించడం ప్రారంభించాడు. రోజుకో యాక్టివా చొప్పున దొంగలించి.. అలా దొంగతనం చేసిన బైకులతో వివిధ ప్రాంతాల్లో తిరిగేవాడు. 
 
ఆ తరువాత వాటిల్లో పెట్రోల్ అయిపోయాక దానిని పట్టించుకోకుండా వదిలేసేవాడు. ఇలా 150కి పైగా యాక్టివాలను చోరీ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. 
 
ఈ నేపథ్యంలో నిందితుడు యాక్టీవాపై ప్రయాణిస్తూ పిరానా అనే ప్రాంతంలో పోలీసులకు పట్టుబడ్డాడు. గత మూడు నెలల్లో దాదాపు 70కి పైగా స్కూటర్లను దొంగిలించాడని పోలీసులు గుర్తించారు. విచారణలో అతడు కోటీశ్వరుడని తేలింది. ఇతనిపై గతంలోనూ నేర చరిత్ర వుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు