షాకింగ్, బుల్లెట్ మోటార్‌కి మంటలు, ఆర్పుతుండగా పేలుడు, ఆరుగురికి తీవ్ర గాయాలు - live video

ఐవీఆర్

ఆదివారం, 12 మే 2024 (21:54 IST)
హైదరాబాదులో ఆదివారం సాయంత్రం మొఘల్‌పురా వద్ద ఘోర ఘటన చోటుచేసుకున్నది. మంటలను ఆర్పే ప్రయత్నంలో ఉండగా బుల్లెట్ మోటార్‌సైకిల్‌లోని ఇంధన ట్యాంక్ పేలడంతో ఒక పోలీసు సహా ఆరుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ జంట మోటార్‌సైకిల్‌పై వెళ్తుండగా మైమర్ చికెన్ సెంటర్ బీబీ బజార్ రోడ్డు సమీపంలో వాహనం నుంచి మంటలు చెలరేగాయి.
 
దంపతులు ద్విచక్రవాహనం నుంచి కిందకు దిగారు. స్థానికులు గుమిగూడి సమీపంలోని దుకాణం నుంచి తెచ్చిన నీటిని ఉపయోగించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. నీళ్లు, గోనె సంచులను ఉపయోగించి మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తుండగా, ట్యాంక్ అకస్మాత్తుగా పేలడంతో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారందరినీ చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. మోటార్ సైకిల్ పేలుడు ఘటనలో పార్క్ చేసిన మరో రెండు మోటార్‌సైకిళ్లకు కూడా మంటలు అంటుకున్నాయి. ఈ మంటల కారణంగా దుకాణం కూడా ధ్వంసమైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

లైవ్ షాకింగ్ వీడియో

మంటలు ఆర్పుతుండగా పేలిన బైక్

హైదరాబాద్ - మొఘల్‌పురా వద్ద బుల్లెట్ బైక్ లో వొచ్చిన మంటలు అదుపుచేయబోయిన స్థానికులు, ఒక్కసారిగా మంటల తీవ్రత పెరగడంతో ఒక పోలీసుతో పాటు పది మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.. pic.twitter.com/EyVOpnpVWk

— Telugu Scribe (@TeluguScribe) May 12, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు