నా భార్య టార్చర్ భరించలేక చనిపోతున్నా: టీసీఎస్ రిక్రూట్మెంట్ మేనేజర్ ఆత్మహత్య సెల్ఫీ video

ఐవీఆర్

శుక్రవారం, 28 ఫిబ్రవరి 2025 (13:43 IST)
భార్యా బాధితులు క్రమంగా ఎక్కువైపోతున్నారా... అంటే అవుననే అనే పరిస్థితి కనిపిస్తున్నట్లుంది. ఇటీవలే బెంగళూరులో ఓ టెక్కీ తన భార్య వేధింపులకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు మరో భార్యా బాధితుడు బలవన్మరణం చెందాడు. ముంబై నగరంలో మానవ్ శర్మ అనే యువకుడు తన భార్య పెడుతున్న వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోలో వెల్లడించాడు.
 
ఆ వీడియోలో అతడు బెడ్ షీటును మెడకి చుట్టుకుని ఫ్యానుకి కట్టి కనబడ్డాడు. వీడియోలో మాట్లాడుతూ... నా భార్య నన్ను చెప్పుకోలేనివిధంగా వేధిస్తోంది. నేనిక బతకలేను. నా ముందు చావు ఒక్కటే పరిష్కారం కనబడుతోంది. దయచేసి మగవాళ్లు గురించి ఎవరైనా మాట్లాడండి. మగవాళ్లు అనుభవిస్తున్న బాధలను చూడండి. నేను ఒంటరినైపోయాను. నేను చనిపోయాక నా తల్లిదండ్రుల జోలికి మాత్రం వెళ్లొద్దు'' అంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. అతడు ముంబైలోని టీసీఎస్ లో రిక్రూట్మెంట్ మేనేజరుగా పనిచేస్తున్నట్లు సమాచారం.

ముంబైలో దారుణం జరిగింది. మానవ్ శర్మ అనే వ్యక్తి తన భార్య వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముంబైలోని టీసీఎస్‌లో రిక్రూట్‌మెంట్ మేనేజర్‌గా పని చేస్తున్న మానవ్.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ‘‘నా భార్య టార్చర్ భరించలేకపోతున్నా. దయచేసి మగవాళ్ల గురించి ఎవరైనా… pic.twitter.com/g31lW6fwe8

— ChotaNews App (@ChotaNewsApp) February 28, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు