రెండో పెళ్లి, భార్య ఆ పని చేస్తుందని చూసి షాక్ తిన్న భర్త, ఆ తర్వాత?

సోమవారం, 10 మే 2021 (16:51 IST)
మొదటి భర్త అనారోగ్యంతో చనిపోయాడు. ఆమెకు ఒక కుమార్తె ఉంది. ఆమెకు 21 యేళ్లు. ఇంటి పక్కనే ఉండడంతో ఆమెను బాగా నమ్మాడు. ఇంట్లో ఎప్పుడూ సైలెంట్‌గా ఉంటూ తన పని తాను చేసుకుంటూ పోతుందని భావించాడు. ఆమెకు కొత్త జీవితం ఇవ్వాలనుకున్నాడు. రెండవ పెళ్ళి చేసుకున్నాడు. అయితే పెళ్లి చేసుకున్న నెల రోజులకే ఆమె బాగోతం బయటపడింది.
 
చెన్నై రాయపేట మహ్మద్ హుస్సేన్ వీధికి చెందిన నిషా, తండ్రి ముషాఫర్ వద్ద ఉంటోంది. ఆమెకు 21 యేళ్ళ కుమార్తె ఉంది. భర్త అనారోగ్యంతో చనిపోవడంతో సంవత్సరం క్రితమే తండ్రి దగ్గరకు కుమార్తెను తీసుకుని వచ్చేశారు. ప్రస్తుతం వీరు ముగ్గురు కలిసే ఉన్నారు. అయితే ఒంటరిగా ఉన్నానన్న భావన నిషాలో కలిగింది.
 
తండ్రికి ఈ విషయాన్ని చెప్పింది రెండవ పెళ్ళి సంబంధం చూడడం మొదలెట్టాడు. అయితే ఇంటి పక్కనే ఉన్న అబ్ధుల్ ఖాదర్ అనే ఆటో డ్రైవర్ ఆమెను పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. ఇంటి పక్కనే ఉండటంతో ఆమె గురించి బాగా ఖాదర్ తెలుసు.
 
ఎంతగానో నమ్మి ఆమెను వివాహం చేసుకున్నాడు. అయితే వివాహమైన నెల రోజులకే నిషా బాగోతం మొత్తం కనుక్కొన్నాడు అబ్దుల్. సొంత కుమార్తెను వ్యభిచారానికి బలవంతంగా పంపడం.. ఆమె కూడా వెళ్ళి డబ్బులు సంపాదించడాన్ని చూశాడు. హెచ్చరించాడు. ఆమె వినలేదు.
 
ఆగ్రహంతో ఊగిపోయిన అబ్ధుల్ ఇంటిలోనే అతి దారుణంగా నిషాను చంపేశాడు. ఆ తరువాత పోలీసు స్టేషన్‌కు వెళ్ళి అతనే లొంగిపోయాడు. భార్యను ఎందుకు చంపాల్సి వచ్చిందన్న విషయాన్ని పోలీసులకు వివరించి మరీ లొంగిపోయాడు నిందితుడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు