వివరాల్లోకి వెళితే, హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట్లూరు సమీపంలో వేగంగా వస్తున్న కారు డీసీఎం వ్యాన్ను బలంగా ఢీకొట్టింది. ఈ ఢీకొన్న ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మరణించారు.